అంధ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరంలోని పూల్ బాగ్ లో ఉన్న ప్రభుత్వ
అంధుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి
వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
ప్రధానాచార్యుడు మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో
తెలిపారు. 38 సీట్లు ఉన్నాయన్నారు. 40 శాతం
అంధత్వం కలిగిన 6 నుంచి 14 ఏళ్లలోపు బాల,
బాలికలు అర్హులన్నారు. ఉచిత వసతి, పౌష్టికాహారం,
ఆధునిక బ్రెయిలీ సామగ్రితో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.